వ్యూహం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమాలు తీయను: ఆర్జీవీ
- June 13, 2023
హైదరాబాద్: సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఆర్జీవీ ముందు నుంచి కూడా ఏపీ సీఎం జగన్ కు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడు. గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మరో పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు.
ఇటీవల జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తాను అని, రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. ఈ సినిమాకు జగన్ పార్టీకి చెందిన వ్యక్తులే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. నా కెరీర్ లో రాజకీయ సినిమాలు కేవలం సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే చేశాను. ఇప్పుడు వ్యూహం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కేవలం ఎలక్షన్స్ సమయంలోనే సేల్ అవుతాయి. అందుకే వ్యూహం సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ అయిదేళ్ల వరకు పొలిటికల్ సినిమాలు తీయను. వ్యూహం సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వ్యూహం 2 సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అని తెలిపారు.
ఇక వ్యూహం సినిమా కథ గురించి చెప్తూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ ని తొక్కేయాలనుకున్నారు. కొందరు కుట్రలు చేశారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లోచూపిస్తాను. ఈ సినిమాకు మొదట కుట్ర అనే టైటిల్ అనుకున్నాను కానీ చీప్ గా ఉంటుందని తర్వాత వ్యూహంగా మార్చాను. వ్యూహం 2 లో జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన అంశాల గురించి, జగన్ పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది అని తెలిపారు ఆర్జీవీ.
గత ఎలక్షన్స్ సమయంలో ఆర్జీవీ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లాగే ఈ వ్యూహం సినిమాలు కూడా క్లిక్ అవుతాయా? ఎలక్షన్స్ సమయంలో జగన్ కి ఇవి పని చేస్తాయా చూడాలి. ఇటీవల వ్యూహం సినిమా గురించి ఆర్జీవీ వరుస పోస్టులు పెడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా చర్చగా మారింది.
తాజా వార్తలు
- సౌదీ, యూఏఈలపై డ్రోన్ దాడులను ఖండించిన ఎంపీలు..!!
- ఎన్నారైలు యూఏఈ నుండి డ్యూటీ ఫ్రీలో బంగారు నాణేలు తీసుకువెళ్లవచ్చా?
- పవిత్ర స్థలాల్లో పర్యటించిన మక్కా డిప్యూటీ ఎమిర్..!!
- ఒమన్లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- డిజిటల్ రిమోట్ టవర్ వ్యవస్థతో 360-డిగ్రీల కవరేజీ: ఖతార్
- కువైట్-సౌదీ రైలు మార్గానికి ఆమోదం..!!
- శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
- యూఏఈలో 16 భారతీయ వీసా, కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్న అల్హింద్ గ్రూప్
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!









