డోనస్కీపై రష్యా దళాలు దాడి.. ముగ్గురు మృతి
- June 14, 2023
కీవ్: ఈరోజు తెల్లవారుజామున రష్యా దళాలు డోనస్కీపై అటాక్ చేశాయి. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు. రాకెట్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు డోనస్కీ మిలిటరీ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు. డోనస్కీ, ఒడిసా నగరాల్లో భారీ నష్టం జరిగిందని, డజన్ల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమైనట్లు కిరిలెంకో చెప్పారు. డోనస్కీని టార్గెట్ చేస్తూ రష్యా ఆరు కేహెచ్-22 క్రూయిజ్ మిస్సైళ్లను వదిలినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
మరోవైపు జర్మనీలో నాటో దళాలు ఏరియల్స్ డ్రిల్స్ నిర్వహించాయి. వందల సంఖ్యలో యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగిరాయి. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నాటో దళాలు ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. మొత్తం 250 యుద్ధ విమానాలతో ప్రదర్శన నిర్వహించారు. దీంట్లో 190 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పదివేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇవాళ రష్యా 20 మిస్సైళ్లు, డ్రోన్లు లాంచ్ చేసిందని, దాంట్లో 12 ఏరియల్ వెహికిల్స్ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







