మొబైల్ యాప్ ద్వారా మల్టీ బ్యాంక్ ఖాతాల నుండి చెల్లింపులు..!
- June 15, 2023
యూఏఈ: ప్రవాసులు త్వరలో ఇంటర్నల్ పేమెంట్ ప్లాట్ఫారమ్ను ప్రవేశపెట్టడంతో మల్టీ బ్యాంక్ ఖాతాల నుండి మొబైల్ యాప్ల ద్వారా డబ్బును పంపే సౌలభ్యాన్ని పొందుతారు. మనీ ఎక్స్ఛేంజ్ , రెమిటెన్స్ వ్యాపారంలో ఉన్న ఫారిన్ ఎక్స్ఛేంజ్, రెమిటెన్స్ గ్రూప్ (ఫెర్గ్) వైస్-ఛైర్మన్ అదీబ్ అహమ్మద్ మాట్లాడుతూ.. ఎక్స్ఛేంజ్ హౌస్లు అంతర్గత చెల్లింపు వ్యవస్థ కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. తక్షణ చెల్లింపు ప్లాట్ఫారమ్ (IPP), ఒకే యాప్ ద్వారా బహుళ బ్యాంకుల ఖాతాల నుండి తక్షణ నిధుల బదిలీని ప్రారంభిస్తుందని తెలిపారు. టెక్నో మీట్ 23 సందర్భంగా ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతర్గత చెల్లింపులు ప్రస్తుతం అమలులో లేవని, ఎక్స్ఛేంజ్ హౌస్లు బహుళ బ్యాంక్ ఖాతాలు లేదా వాలెట్ల నుండి కస్టమర్ నుండి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుందని వివరించారు.
యూఏఈలో ఎక్కువ మంది ప్రవాసులు నివసిస్తున్నందున, ప్రవాస కార్మికులు వారి కుటుంబాలకు ప్రధానంగా ఆసియా, మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికాకు ప్రతినెలా బిలియన్ల దిర్హామ్లు పంపుతారు. ప్రస్తుతం, మొత్తం రెమిటెన్స్లలో దాదాపు 11 శాతం డిజిటల్ మార్గాల ద్వారా జరుగుతున్నాయని షరాఫ్ ఎక్స్ఛేంజ్ సీఈఓ ఇమాద్ ఉల్ మాలిక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!