రక్తదానం చేసిన ఒమానీ దౌత్యవేత్తలు
- June 15, 2023
మస్కట్: ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఒమానీ రాయబార కార్యాలయాలు, మస్కట్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఒమన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులు, ఒమన్ సుల్తానేట్ ఎంబసీలోని ఉద్యోగులు రక్తదానం చేయడానికి గుర్తింపు పొందిన దేశాలలోని ఆసుపత్రులను సందర్శించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సిబ్బంది కూడా సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ హాస్పిటల్ నిర్వహించిన క్యాంప్ లో రక్తదానం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్య కేంద్రాలలో రక్తం కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో సహాయపడటానికి మానవతా చర్యగా ఆరోగ్య రంగానికి మద్దతు ఇవ్వడం, రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్తదాన కార్యక్రమం మానవీకరణ, నిస్వార్థత, సామాజిక బాధ్యత, భాగస్వామ్యం, మానవతా ధార్మిక కార్యకలాపాల విలువను పెంచిందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







