సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి..
- May 13, 2016
సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు భారత్లోని తొలి సోలార్ రైలు నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే సోలార్ రైలును ట్రయల్ రన్ చేస్తామని నార్త్వెస్ట్రన్ రైల్వే పీఆర్వో గోపాల్ శర్మ వెల్లడించారు. ఈ నెలాఖరులో ట్రయల్ రన్ ఉండొచ్చని చెప్పారు.పై కప్పు మీద సోలార్ ప్యానల్స్తో ప్రత్యేకంగా కోచ్లను నిర్మిస్తున్నారు. రైలు లోపల లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందుతుంది. రైలు మాత్రం డీజిల్ ఇంజన్లతో నడుస్తుంది. రైళ్లలో ఇంధన ఉపయోగాన్ని తగ్గించడానికి రైల్వే ఇప్పటికే సీఎన్జీ, బయోడీజిల్, సహజవాయువు తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







