కియారా అద్వానీకి తొమ్మిదేళ్లు.!
- June 15, 2023
అవునండీ మీరు విన్నది నిజమే. హీరోయిన్గా కియారా అద్వానీ కెరీర్ స్టార్ట్ అయ్యి తొమ్మిదేళ్లు గడిచింది. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన కియారా తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమా సూపర్ హిట్. రెండో సినిమాకి రామ్ చరణ్తో జత కట్టింది కానీ, ఫెయిలైంది. ఇక్కడ ఫెయిలైనా, బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ కలిసొచ్చింది కియారాకి.
ప్రస్తుతం కియారా ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రంలో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడే తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. అప్పుడే తొమ్మిదేళ్లు గడిచిపోయాయా.? అంటూ సోషల్ మీడియా వేదికగా కియారా ఓ పోస్ట్ పెట్టింది.
ఇన్నేళ్లు తనను అభిమానించిన అభిమానులందరికీ, సపోర్ట్ చేసిన శ్రేయోభిలాషులకీ కియారా ఈ సందర్భంగా థాంక్స్ చెప్పింది.
తొమ్మిదేళ్లు గడిచినా నటనలో ఇంకా కొత్తగానే వుందని తెలిపింది. నటనలో మరింత పరిణీతి చెంది, మరింతగా మీ ఆదరాభిమానాలను అందుకుంటానని తెలిపింది. కియారా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
తాజా వార్తలు
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!