రక్త హీనతతో బాధపడుతున్నారా.?

- June 15, 2023 , by Maagulf
రక్త హీనతతో బాధపడుతున్నారా.?

శరీరంలో సరిపడా రక్తం లేకపోతే, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, విపరీతమైన నీరసం వేధిస్తుంటుంది. ఏ పని మీదా ఫోకస్ పెట్టలేరు. మరి, రక్తం స్ధాయిలు పెంచుకుని, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఎలాంటి ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు బాగా తీసుకుంటే రక్తం బాగా పడుతుంటారు. ముఖ్యంగా పాలకూర అందులో మొదటి ప్లేస్‌లో వుంటుంది.

అలాగే పుల్లని జాతికి చెందిన ఉసిరి, ద్రాక్ష జాతి పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే పండ్లలో దానిమ్మ పండుకు హెమోగ్లోబిన్ పెంచే కెపాసిటీ చాలా ఎక్కువ. 

క్యారెట్ కూడా రక్త హీనత నుంచి కాపాడడంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది.

నిమ్మకాయను ప్రతీరోజూ డైట్‌లో చేర్చుకుంటే, రక్త హీనత బారిన పడే ప్రమాదమే వుండదని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com