జంధ్యాల తెలుగు తెరకు అందించిన రత్నాలు ప్రదీప్, పూర్ణిమ
- June 18, 2023
హైదరాబాద్: ప్రఖ్యాత దర్శకుడు తెలుగు తెరకు అందించిన రత్నాలు ప్రదీప్ పూర్ణిమ లని వంశీ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై శారద మ్యూజిక్ అకాడమీ నిర్వ్యహణ లో తెలుగు హిందీ సినీ గీతాల విభావరి జరిగింది. గాయని శారద సహాగాయకులు మోహన్,పవన్ కుమార్, భరద్వాజ్,నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి తో కలసి మధురం గా గానం చేశారు. లక్ష్మీ పద్మజ, రేణుక, రమా దేవి తదితరులు కూడా పాల్గొని పాటలు అలపించారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో వంశీ రామ రాజు పాల్గొని నటుడు ప్రదీప్ ను నటి పూర్ణిమ ను శారద, తదితర అతిధుల తో సత్కరించి మాట్లాడారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమా లో జంటగా పరిచయం ఐన ప్రదీప్ పూర్ణిమ లు సాత్విక నటన తో అసభ్యత లేకుండా ప్రేమ సన్నివేశాలు పండించి ప్రేక్షక హృదయాలు లో నేటికి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని వివ రించారు. వీరిని సత్కరించటం గత కాలపు మంచిని గుర్తు చేసుకోవటం అన్నారు. పూర్ణిమ గాయకులతో కలసి శ్రావ్యం గా పాడి మాట్లాడుతూ పాత పాటలు పాడటం తనకు ఇష్టమని, అవకాశం కల్పించిన శారద కు ధన్య వాదాలు తెలిపారు. ప్రదీప్ మాట్లాడుతూ గాన సభ లోశక్తి ఉందని ఈ వేదిక పై నాటకం వేస్తున్నప్పుడు చూసి జంధ్యాల తనను సినిమా హీరో చేశారని తెలిపారు పోషకులు వేణు గోపాల్, సుందరి, కోటేశ్వరరావు, నాగేస్వరి, రామకృష్ణ తనికెళ్ళ,ప్రతాప్ కుమార్, జగదేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









