'బ్రహ్మోత్సవం' మే 28న ప్రేక్షకుల ముందుకు..
- May 13, 2016
మహేశ్బాబు, కాజల్, సమంత కలయికతో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల ఉత్కంఠకు తెరదీస్తూ ఈ చిత్రాన్ని మే నెలాఖరులోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కథానాయికలు సమంత, కాజల్లు చిత్ర విశేషాలు తెలియజేశారు. 'బ్రహ్మోత్సవం' అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుందని సమంత తెలిపారు. అన్నివర్గాలను ఆకట్టుకునేలా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కథానాయికలు పేర్కొన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్బాబు, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. మిక్కీ జె. మేయర్, మణిశర్మ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







