'బ్రహ్మోత్సవం' మే 28న ప్రేక్షకుల ముందుకు..

- May 13, 2016 , by Maagulf
'బ్రహ్మోత్సవం'  మే 28న ప్రేక్షకుల ముందుకు..

మహేశ్‌బాబు, కాజల్‌, సమంత కలయికతో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల ఉత్కంఠకు తెరదీస్తూ ఈ చిత్రాన్ని మే నెలాఖరులోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కథానాయికలు సమంత, కాజల్‌లు చిత్ర విశేషాలు తెలియజేశారు. 'బ్రహ్మోత్సవం' అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుందని సమంత తెలిపారు. అన్నివర్గాలను ఆకట్టుకునేలా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కథానాయికలు పేర్కొన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ సంగీతం సమకూర్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com