రోడ్డు ప్రమాదంలో భారతీయుని మృతి

- May 13, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో భారతీయుని  మృతి

మనామా:  గురువారం ఒక ట్రక్  డీ కొట్టి  వెళ్ళడంతో అక్కడికక్కడే చనిపోయన  బాధితుడు భారత దేశానికి చెందిన వ్యక్తిగా అధికారులు  గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో ఒక  భారీ ట్రక్ అతనిని బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  నివేదికల ప్రకారం, భారీ ట్రక్ అతని  తలని  ముక్కలు ముక్కలుగా చితకకోట్టింది. సలమాబాద్  ప్రాంతంలో మరణించిన వ్యక్తి  శిబు, 42,  బహరేన్ ఆక్వా కూల్  సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దారుణం  సంభవించింది. ఈ  ప్రమాదం గురువారం మధ్యాహ్నం  2.30 గంటల సమయంలో జరిగింది. శిబు భారతదేశంలోని కేరళ రాష్ట్రం యొక్క పతనంతిట్ట జిల్లాలో తిరువల్ల ప్రాంతానికి  చెందినవాడు.

భారతదేశం లో ఉన్న తన భార్య మరియు పిల్లలను వదిలి బతుకుతెరువు కోసం వచ్చాడు,  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం    శిబు  కొద్ది నెలల క్రితం ఆక్వా కూల్ లో  పనికి ముందు  గుడైబియ లో  ఒక శుభ్రపరచడం మరియు నిర్వహణ సంస్థ లో  పని చేసినట్లు  డి టి  వార్తలలో తెలిపారు.
సల్మనియా  మెడికల్ కాంప్లెక్స్ (SMC) మృతదేహాలను  భద్రపరిచే చోట  శిబు మృతదేహం ఉంచబడింది. అధికారిక లాంచనాలు పూర్తి కాబడిన తర్వాత అతని పార్ధివ దేహాన్ని తన స్వస్థలమైన భారతదేశం కు   చేయబడుతుంది. శిబు రెండు దశాబ్దాలకు పైగా బహ్రెయిన్ లో  ఒక ప్రవాసీయుడిగా జీవితం  గడుపుతున్నారు. ఆయన సోదరుడు అనిల్ ఐదేళ్ల పాటు బహరేన్ లో  పని చేసి  ఇప్పుడు భారతదేశంలో స్థిరపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com