విల్లాకు Dh23,000 విద్యుత్ బిల్లు.. క్రైం ముఠా గుట్టురట్టు
- June 22, 2023
యూఏఈ: ఫుజైరాలోని రెండు రెసిడెన్షియల్ విల్లాల్లో అధిక విద్యుత్ బిల్లు ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న మోసాన్ని బయటపెట్టింది. వాస్తవానికి సదరు విల్లాలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే అద్దెకు ఉంటారు. అయితే, అధిక విద్యుత్ బిల్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వ్యవస్థీకృత క్రైమ్ గ్రూప్ విషయం బయటికొచ్చింది. విల్లాలో ఎలక్ట్రానిక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ కార్యకలాపాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ బృందం నకిలీ వెబ్సైట్లను సృష్టించి, బాధితులకు భారీ లాభాలను తిరిగి ఇవ్వగలమని పేర్కొంటూ వారి నుండి డబ్బును వసూలు చేస్తుంది. విల్లాలపై దాడి సందర్భంగా అధికారులు భారీగా కంప్యూటర్లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. కేసును విచారించిన ఫుజైరా ఫెడరల్ కోర్టు ఆసియన్ జాతీయతకు చెందిన 10 మంది నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష, 5 మిలియన్ దిర్హామ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వారి నివాసాన్ని స్పాన్సర్ చేసిన వాణిజ్య సంస్థకు 5 మిలియన్ దిర్హామ్లు జరిమానా విధించబడింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనధికార పార్టీలతో సంబంధాలను పెట్టుకోవద్దని కోరింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







