విల్లాకు Dh23,000 విద్యుత్ బిల్లు.. క్రైం ముఠా గుట్టురట్టు
- June 22, 2023
యూఏఈ: ఫుజైరాలోని రెండు రెసిడెన్షియల్ విల్లాల్లో అధిక విద్యుత్ బిల్లు ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న మోసాన్ని బయటపెట్టింది. వాస్తవానికి సదరు విల్లాలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే అద్దెకు ఉంటారు. అయితే, అధిక విద్యుత్ బిల్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వ్యవస్థీకృత క్రైమ్ గ్రూప్ విషయం బయటికొచ్చింది. విల్లాలో ఎలక్ట్రానిక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ కార్యకలాపాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ బృందం నకిలీ వెబ్సైట్లను సృష్టించి, బాధితులకు భారీ లాభాలను తిరిగి ఇవ్వగలమని పేర్కొంటూ వారి నుండి డబ్బును వసూలు చేస్తుంది. విల్లాలపై దాడి సందర్భంగా అధికారులు భారీగా కంప్యూటర్లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. కేసును విచారించిన ఫుజైరా ఫెడరల్ కోర్టు ఆసియన్ జాతీయతకు చెందిన 10 మంది నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష, 5 మిలియన్ దిర్హామ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వారి నివాసాన్ని స్పాన్సర్ చేసిన వాణిజ్య సంస్థకు 5 మిలియన్ దిర్హామ్లు జరిమానా విధించబడింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనధికార పార్టీలతో సంబంధాలను పెట్టుకోవద్దని కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









