విల్లాకు Dh23,000 విద్యుత్ బిల్లు.. క్రైం ముఠా గుట్టురట్టు
- June 22, 2023
యూఏఈ: ఫుజైరాలోని రెండు రెసిడెన్షియల్ విల్లాల్లో అధిక విద్యుత్ బిల్లు ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న మోసాన్ని బయటపెట్టింది. వాస్తవానికి సదరు విల్లాలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే అద్దెకు ఉంటారు. అయితే, అధిక విద్యుత్ బిల్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వ్యవస్థీకృత క్రైమ్ గ్రూప్ విషయం బయటికొచ్చింది. విల్లాలో ఎలక్ట్రానిక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ కార్యకలాపాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ బృందం నకిలీ వెబ్సైట్లను సృష్టించి, బాధితులకు భారీ లాభాలను తిరిగి ఇవ్వగలమని పేర్కొంటూ వారి నుండి డబ్బును వసూలు చేస్తుంది. విల్లాలపై దాడి సందర్భంగా అధికారులు భారీగా కంప్యూటర్లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. కేసును విచారించిన ఫుజైరా ఫెడరల్ కోర్టు ఆసియన్ జాతీయతకు చెందిన 10 మంది నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష, 5 మిలియన్ దిర్హామ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వారి నివాసాన్ని స్పాన్సర్ చేసిన వాణిజ్య సంస్థకు 5 మిలియన్ దిర్హామ్లు జరిమానా విధించబడింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనధికార పార్టీలతో సంబంధాలను పెట్టుకోవద్దని కోరింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







