కీలకమైన అబుధాబి వంతెనపై కొత్త వేగ పరిమితి
- June 22, 2023
యూఏఈ: జూన్ 23 నుండి అబుధాబిలోని అల్ సాదా బ్రిడ్జ్ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నందున కొత్త వేగ పరిమితిని విధించారు. ఇది డిసెంబర్ 2023 చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఎమిరేట్ రవాణా అథారిటీ బుధవారం ప్రకటించింది. శుక్రవారం నుంచి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్లోని వంతెనకు ఇరువైపులా వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించినట్టు అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) తెలిపింది. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని తెలిపింది. "ఇది రద్దీని తగ్గించడానికి, ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మాకు సహాయపడుతుంది" అని ఐటీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







