కీలకమైన అబుధాబి వంతెనపై కొత్త వేగ పరిమితి
- June 22, 2023
యూఏఈ: జూన్ 23 నుండి అబుధాబిలోని అల్ సాదా బ్రిడ్జ్ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నందున కొత్త వేగ పరిమితిని విధించారు. ఇది డిసెంబర్ 2023 చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఎమిరేట్ రవాణా అథారిటీ బుధవారం ప్రకటించింది. శుక్రవారం నుంచి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్లోని వంతెనకు ఇరువైపులా వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించినట్టు అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) తెలిపింది. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని తెలిపింది. "ఇది రద్దీని తగ్గించడానికి, ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మాకు సహాయపడుతుంది" అని ఐటీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







