కీలకమైన అబుధాబి వంతెనపై కొత్త వేగ పరిమితి
- June 22, 2023
యూఏఈ: జూన్ 23 నుండి అబుధాబిలోని అల్ సాదా బ్రిడ్జ్ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నందున కొత్త వేగ పరిమితిని విధించారు. ఇది డిసెంబర్ 2023 చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఎమిరేట్ రవాణా అథారిటీ బుధవారం ప్రకటించింది. శుక్రవారం నుంచి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్లోని వంతెనకు ఇరువైపులా వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించినట్టు అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) తెలిపింది. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని తెలిపింది. "ఇది రద్దీని తగ్గించడానికి, ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మాకు సహాయపడుతుంది" అని ఐటీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









