ఒమన్ లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- June 24, 2023
మస్కట్: మస్కట్ లోని ఘలా ఏరియాలోని రాయల్ హాస్పిటల్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ నందు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భారత జాగృతి ఒమాన్, బీర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ వారు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరులని సంస్కరించుకుంటు రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో తెలంగాణ నుండే కాకుండా భారతదేశంలోని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి యువకులు రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని కార్యనిర్వాహకులు తెలిపారు.
రక్త దానం కార్యక్రమం అనంతరం మిఠాయిలు, కేక్ కట్ చేసి తెలంగాణ ధశాబ్ది ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తేలిపరు .ఈ కార్యక్రమంలో భారత జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమాన్ అధ్యక్షుడు ఈగపురి మహిపాల్ రెడ్డి, భారత్ జాగృతి ఒమాన్ కో కన్వీనర్ బైసింగరపు వినోద్ యాదవ్,బీఆరేస్ ఒమాన్ ప్రధాన కార్యదర్శులు గాంధారి నరేష్, భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, కరుణాకర్,కార్యదర్శులు సాయి రాజు, రాజేందర్, వంశీ, రంజిత్,ప్రమోద్ రెడ్డి, విజయ్,మెడ పట్ల లక్ష్మణ్ ,జగన్,కొయ్యాడి వంశీ ,మంత్రి గోపాల్ ,రంజిత్ కశామొల్ల,కొమురయ్య,వేణు,రాజు, నరేష్ ,రాజేందర్,రంజిత్,శ్రీనివాస్ నేత,అక్తర్,జంబుకా శ్రీనివాస్,గంగాధర్,ప్రదీప్,సుమన్,నాగరాజు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)


తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







