పవన్ నిర్మాతల్లో మొదలవుతోన్న గుబులు.!
- June 24, 2023
ఓ పక్క పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే, మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్గా వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు.
ఒక్కో సినిమానీ పూర్తి చేసుకుంటూ పోతున్నారు. ఎలక్షన్స్ లోపల సినిమాలు పూర్తి చేసి, రిలీజ్ చేసేయాలన్నదే పవన్ కళ్యాణ్ యోచన.
అంతా బాగానే వుంది. కానీ, టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ పవన్ నిర్మాతల్లో గుబులు మొదలైందట. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో పవన్ సినిమాల తీరు ఏమీ బాగుండడం లేదు.
గతంలో వచ్చిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాల విషయంలో చాలానే రచ్చ జరిగింది. టిక్కెట్ల రేట్లు తగ్గించేయడం.. సినిమా ప్రదర్శితమవుతుంటే ఆపేయడం.. ధియేటర్లు బద్దలు కొట్టేయడం.. ఇలా నానా రకాల యాగీ చేశారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.
దాంతో, తెలియలేదు కానీ, కొన్ని చోట్ల నష్టాలు కూడా బాగానే చవి చూశారు నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఎలాగో గట్టెక్కేశారప్పుడు.
కానీ, ఇఫ్పుడు పరిస్థితులెలా వుండబోతాయా.? అని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఆందోళన తీరాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. జూలైలో ‘బ్రో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







