పవన్ నిర్మాతల్లో మొదలవుతోన్న గుబులు.!
- June 24, 2023
ఓ పక్క పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే, మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్గా వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు.
ఒక్కో సినిమానీ పూర్తి చేసుకుంటూ పోతున్నారు. ఎలక్షన్స్ లోపల సినిమాలు పూర్తి చేసి, రిలీజ్ చేసేయాలన్నదే పవన్ కళ్యాణ్ యోచన.
అంతా బాగానే వుంది. కానీ, టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ పవన్ నిర్మాతల్లో గుబులు మొదలైందట. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో పవన్ సినిమాల తీరు ఏమీ బాగుండడం లేదు.
గతంలో వచ్చిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాల విషయంలో చాలానే రచ్చ జరిగింది. టిక్కెట్ల రేట్లు తగ్గించేయడం.. సినిమా ప్రదర్శితమవుతుంటే ఆపేయడం.. ధియేటర్లు బద్దలు కొట్టేయడం.. ఇలా నానా రకాల యాగీ చేశారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.
దాంతో, తెలియలేదు కానీ, కొన్ని చోట్ల నష్టాలు కూడా బాగానే చవి చూశారు నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఎలాగో గట్టెక్కేశారప్పుడు.
కానీ, ఇఫ్పుడు పరిస్థితులెలా వుండబోతాయా.? అని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఆందోళన తీరాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. జూలైలో ‘బ్రో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







