త్వరలో పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2.0 ప్రారంభిస్తాం
- June 25, 2023
న్యూఢిల్లీ: కొత్త, అప్గ్రేడ్ చేసిన ఈ-పాస్పోర్ట్లతో కూడిన పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (PSP-వెర్షన్ 2.0) యొక్క రెండవ దశను భారత్ త్వరలో ప్రారంభించనుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా తెలిపారు. ప్రజలకు పాస్పోర్ట్, సంబంధిత సేవలను సకాలంలో, విశ్వసనీయంగా, అందుబాటులోకి, పారదర్శకంగా, సమర్ధవంతంగా అందజేస్తామని ప్రతిజ్ఞను పునరుద్ధరించడంలో తనతో చేరాలని విదేశాలలో పాస్పోర్ట్ జారీ చేసే అధికారులను జైశంకర్ పిలుపునిచ్చారు. పాస్పోర్ట్ సేవా దివస్ 2023 సందర్భంగా భారత్.. విదేశాలలో పాస్పోర్ట్ జారీ చేసే అధికారులందరికీ, సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్లోని వారి సహచరులకు అభినందనలు తెలియజేయడం సంతోషకరమైన విషయమని జైశంకర్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మంత్రిత్వ శాఖ 2022లో రికార్డు స్థాయిలో 13.32 మిలియన్ల పాస్పోర్ట్లు మరియు ఇతర సేవలను ప్రాసెస్ చేసిందని, ఇది 2021తో పోలిస్తే 63 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వ లక్ష్యం అయిన 'డిజిటల్ ఇండియా' దిశగా పాస్పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) గణనీయంగా దోహదపడిందని జైశంకర్ తన సందేశంలో పేర్కొన్నారు. 2014లో దేశంలో 77 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (PSK) ఉండగా, ఈ సంఖ్య 7 రెట్లు పెరిగి నేడు 523కి చేరుకుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









