దేశీయ యాత్రికులు డిజిటల్ కార్డ్ని తీసుకెళ్లడం తప్పనిసరి
- June 26, 2023
మక్కా:దేశీయ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించేటప్పుడు, పవిత్ర స్థలాల్లోకి వెళ్లేటప్పుడు వారి డిజిటల్ కార్డును వారి స్మార్ట్ ఫోన్లలో తీసుకెళ్లడం, భద్రతా అధికారులకు చూపించడం తప్పనిసరి. దేశీయ యాత్రికుల కోసం కంపెనీలు మరియు ఎస్టాబ్లిష్మెంట్ల కోఆర్డినేషన్ కౌన్సిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ దేశీయ యాత్రికుల కోసం అన్ని హజ్ సేవలను అందించే కంపెనీలు, స్థాపనలకు ఈ విషయంలో అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. మండలి అన్ని సంస్థలకు నుసుక్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి దాని ద్వారా డిజిటల్ కార్డ్ను యాక్టివేట్ చేయమని యాత్రికులకు సూచించాలని కోరింది. దేశీయ యాత్రికులందరూ డిజిటల్ కార్డును తమ మొబైల్ ఫోన్లలో అప్లోడ్ చేయడం ద్వారా ఉపయోగించాల్సిన అవసరాన్ని కౌన్సిల్ నొక్కి చెప్పింది. దేశీయ యాత్రికులందరూ తప్పనిసరిగా స్మార్ట్ కార్డ్ని పొందాలనే ఆదేశాన్ని పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!









