ఒమన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ దోవల్
- June 27, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటనకు వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సాంకేతిక, సైనిక, మైనింగ్ రంగాలలో ఆశాజనక రంగాల గురించి సహకారం అంశాలపై ఇద్దరు చర్చించారు. వాణిజ్య, సాంస్కృతిక మరియు పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు సమీక్షించారు.జి 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం తరపున సయ్యద్ బదర్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నారు. నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ సహకారం విధానాలను సమర్థించడంపై తమ రెండు దేశాల నాయకత్వాల ప్రాధాన్యతను వారు నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో జిసిసి, ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ హషీల్ అల్ మస్కారి, ఒమన్ సుల్తానేట్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి అమిత్ నారంజ్, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







