ఒమన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ దోవల్
- June 27, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటనకు వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సాంకేతిక, సైనిక, మైనింగ్ రంగాలలో ఆశాజనక రంగాల గురించి సహకారం అంశాలపై ఇద్దరు చర్చించారు. వాణిజ్య, సాంస్కృతిక మరియు పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు సమీక్షించారు.జి 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం తరపున సయ్యద్ బదర్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నారు. నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ సహకారం విధానాలను సమర్థించడంపై తమ రెండు దేశాల నాయకత్వాల ప్రాధాన్యతను వారు నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో జిసిసి, ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ హషీల్ అల్ మస్కారి, ఒమన్ సుల్తానేట్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి అమిత్ నారంజ్, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









