ఒమన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ దోవల్
- June 27, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటనకు వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సాంకేతిక, సైనిక, మైనింగ్ రంగాలలో ఆశాజనక రంగాల గురించి సహకారం అంశాలపై ఇద్దరు చర్చించారు. వాణిజ్య, సాంస్కృతిక మరియు పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు సమీక్షించారు.జి 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం తరపున సయ్యద్ బదర్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నారు. నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ సహకారం విధానాలను సమర్థించడంపై తమ రెండు దేశాల నాయకత్వాల ప్రాధాన్యతను వారు నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో జిసిసి, ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ హషీల్ అల్ మస్కారి, ఒమన్ సుల్తానేట్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి అమిత్ నారంజ్, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







