ఒమన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ దోవల్‌

- June 27, 2023 , by Maagulf
ఒమన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ దోవల్‌

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సాంకేతిక, సైనిక,  మైనింగ్ రంగాలలో ఆశాజనక రంగాల గురించి సహకారం అంశాలపై ఇద్దరు చర్చించారు. వాణిజ్య, సాంస్కృతిక మరియు పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు సమీక్షించారు.జి 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం తరపున సయ్యద్ బదర్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నారు. నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ సహకారం విధానాలను సమర్థించడంపై తమ రెండు దేశాల నాయకత్వాల ప్రాధాన్యతను వారు నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో జిసిసి,  ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ హషీల్ అల్ మస్కారి, ఒమన్ సుల్తానేట్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి అమిత్ నారంజ్, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com