సౌదీలో భానుడి ఉగ్రరూపం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- June 27, 2023
మినా: ఈ సంవత్సరం హజ్ సీజన్ 1444 AH సమయంలో వేడి సంబంధిత ప్రమాదాల గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాత్రికులను అప్రమత్తం చేసింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా యాత్రికుల ఆరోగ్యానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బయటికి వచ్చిన సమయంలో గొడుగులను ఉపయోగించాలని, ద్రవ పధార్థాలను పుష్కలంగా తాగాలని, శారీరక శ్రమను ఎక్కువగా చేయవద్దని, ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించడం వల్ల యాత్రికులు తమను తాము హీట్స్ట్రోక్ లేదా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర సమయంలో ఆరోగ్య కాల్ సెంటర్ (937) యాత్రికుల ఆరోగ్య సందేహాలను పరిష్కరిస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదేవిధంగా పవిత్ర ప్రదేశాలలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వైద్య సేవలు అవసరమైన యాత్రికులు వారిని సంప్రదించాలని సూచించింది. ఈ వైద్య కేంద్రాలు 24/7 పని చేస్తాయని, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్, ఇండోనేషియన్, టర్కిష్ మరియు పర్షియన్ వంటి బహుళ భాషలలో ప్రావీణ్యం కలిగిన సిబ్బందిని నియమించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







