హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి

- July 01, 2023 , by Maagulf
హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి

సౌదీ అరేబియా: హజ్2023 కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ముగ్గురు ఫిలిప్పీనియన్లు మరణించినట్లు రియాద్‌లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ శుక్రవారం ధృవీకరించింది. యాత్రికులు సహజ కారణాలతో మరణించారని పేర్కొంది. ఎంబసీ, ఫిలిప్పీన్స్ కాన్సులేట్ పవిత్ర నగరమైన మక్కాలో మరణించిన వారి ఖననంలో సహాయం చేస్తున్నదని ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ రోమెల్ రొమాటో పేర్కొన్నారు. హజ్ కోసం సౌదీ అరేబియాలో ఉన్న 7,000 మందికి పైగా ఫిలిప్పినోల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది యాత్రికుల అవసరాలను తీర్చే ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, యాత్రికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని అని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com