దోఫర్‌లో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్స్

- July 01, 2023 , by Maagulf
దోఫర్‌లో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్స్

మస్కట్: జూన్ 30న ధోఫర్ గవర్నరేట్‌లోని ఒక పర్యాటక ప్రదేశంలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్‌లోని ఒక పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ బృందాలు వాడి దర్బాత్‌లో మునిగిపోయిన సంఘటనపై స్పందించాయని, అక్కడ బృందాలు వ్యక్తిని బయటకు తీసి అత్యవసర వైద్య సంరక్షణ అందించినట్లు పేర్కొంది. సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్లు CDAA తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com