చర్మం పొడిబారిపోతోందా? పరిష్కారమిదిగో!
- June 23, 2015
వేసవిలోనూ, చలికాలంలోనూ కూడా కొందరికి చర్మం పొడిబారిపోయి దురద, దద్దుర్లు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఇబ్బందిని ఎదుర్కోవాలంటే స్నానం చేసే నీళ్లలో రెండు చుక్కల కొబ్బరినూనె వేసినా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు వేసి మరగబెట్టి, గోరు వెచ్చగా అయ్యాక ఒంటికి రాసుకోవాలి. ఎక్కువగా చలి కాలంలో చర్మంతో పాటు మాడు కూడా పొడిబారి దురద పెడుతూ ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే కొద్దిగా కొబ్బరి నూనెలో రెండు చుక్కల వెనిగర్ వేసి ఆ మిశ్రమాన్ని దూదితో తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో అంతే పరిమాణంలో బొప్పాయి గుజ్జుని కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికీ, జుట్టుకీ రాసుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ పెరిగి తాజాగా కనిపిస్తుంది. మరియు దురద, దద్దుర్ల సమస్య కూడా తీరుతుంది. వీటన్నిటితోపాటూ వాడే సబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మీ శరీరానికి ఏ సబ్బు సరిపోతుందో తెలుసుకుని, దాన్ని మాత్రమే వినియోగించాలి. మార్కెట్లో దొరికే కొత్త కొత్త సబ్బుల్ని ఉపయోగించాలనే సరదాని పక్కనపెడితే, శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









