సైబర్ క్రైమ్తో తస్మాత్ జాగ్రత్త
- May 13, 2016
దుబాయ్ విమెన్స్ అసోసియేషన్ సహకారంతో దుబాయ్ పోలీస్, ఎటిసలాట్తో అల్ అమీన్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో 'పెరుగుతున్న బ్లాక్మెయిలింగ్' కేసుల పట్ల పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్స్, బ్లాక్మెయిలింగ్ కేసులు, అలాగే యూఏఈ చట్టాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చ జరిగింది. మహిళలు, పిల్లలు సోషల్ మీడియా కారణంగా బాధితులవుతున్నారనీ, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం లేదా ఫొటోలను పంపించడం ప్రమాదకరమని ఇంజనీర్ అబ్దుల్ అజీజ్ అల్ జరౌని చెప్పారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో ఉండే వెబ్సైట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 2013లో అల్ అమీన్ 80 బ్లాక్మెయిల్ కేసులను ఎదుర్కొందని, 2012లో వీటి సంఖ్య 212గా ఉందని, ఓ వ్యక్తి 60 మంది పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి, వారికి చెందిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అందులో చాలామంది పిల్లలు ఆత్మహత్యాత్నం చేశారని ఖలీల్ అల్ అలి చెప్పారు. ఈ సంఘటన వేరే దేశంలో జరిగింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







