దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కి వినియోగదారుల విద్యుత్‌

- May 13, 2016 , by Maagulf
దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కి వినియోగదారుల విద్యుత్‌

తమ భవనాలపై సోలార్‌ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసి, వాటి ద్వారా విద్యుత్‌ని ఖర్చు లేకుండా పొందుతున్న వినియోగదారులు, తాము వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ (దెవా) గ్రిడ్‌కి అనుసంధానిస్తున్నారు. మొత్తం 30 ఫొటోవాల్‌టాయిక్‌ సిస్టమ్స్‌ ఇన్‌స్టాల్‌ కాగా, అందులో ఆరు సిస్టమ్స్‌ దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ చెయ్యబడ్డాయి. షామ్స్‌ దుబాయ్‌ ఇనీషియేటివ్‌ పేరుతో గత ఏడాది మార్చ్‌లో ఇచ్చిన పిలుపు మేరకు ఈ అద్భుతం చోటుచేసుకుంది. సౌర విద్యుత్‌ వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ విద్యుత్‌ వినియోగం తగ్గించగలిగామని అధికారులు చెప్పారు. 18 ప్రభుత్వ సంస్థలతో 37 ప్రాజెక్టులను 279 కిలోవాట్స్‌ కెపాసిటీతో చేపట్టి, వాటి ద్వారా ఏడాదికి 445 మిలియన్‌ వాట్స్‌ కరెంట్‌ని ఉత్పత్తి చేయగలుగుతోంది దెవా. 2050 నాటికి క్లీన్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ ఎకానమీ విభాగంలో దుబాయ్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా షామ్స్‌ దుబాయ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా చేయస్తామని దెవా సీఈఓ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సయీద్‌ మొహమ్మద్‌ అల్‌ తయార్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com