పారిస్‌లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ

- July 02, 2023 , by Maagulf
పారిస్‌లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ

యూఏఈ: అల్లర్లు నేపథ్యంలో పారిస్‌లోని ఎమిరాటీలు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ మేరకు పారిస్‌లోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది.  ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది. ఫ్రెంచ్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను అనుసరించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు 0097180024 లేదా 0097180044444లలో సంప్రదించాలని కోరింది.  మరోవైపు మార్సెయిల్, లియోన్, టౌలౌస్, స్ట్రాస్‌బర్గ్, లిల్లే వంటి నగరాలతో సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు భవనాలు, వాహనాలు తగులబెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. పారిస్‌లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com