పారిస్లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ
- July 02, 2023
యూఏఈ: అల్లర్లు నేపథ్యంలో పారిస్లోని ఎమిరాటీలు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ మేరకు పారిస్లోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది. ఫ్రెంచ్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను అనుసరించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు 0097180024 లేదా 0097180044444లలో సంప్రదించాలని కోరింది. మరోవైపు మార్సెయిల్, లియోన్, టౌలౌస్, స్ట్రాస్బర్గ్, లిల్లే వంటి నగరాలతో సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు భవనాలు, వాహనాలు తగులబెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. పారిస్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









