'సత్య' కు పాతికేళ్ళు
- July 03, 2023
హైదరాబాద్: మూస సినిమాల సమయంలో తెలుగు సినిమా గతిని మార్చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రంగీలా, క్షణక్షణం సినిమాలతో బాక్సాఫీస్లు బద్దలు గొట్టిన వర్మ మూడవ సినిమా సత్య. 1998 వరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు సరికొత్త అర్దాన్ని చెప్పిన సినిమా. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ ప్రయోగానికి అప్పట్లో దేశమంతా ఎట్రాక్ట్ అయ్యింది. రియల్ ఇన్సిడెంట్ నుంచి మొదలైన కథను వర్మ చూపించిన విధానమే అందుకు కారణం. సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి 25 ఏళ్లవుతోంది. గ్యాంగ్ స్టర్స్ అన్న పేరు వినడమే గానీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వర్మ చూపించిన విధానం కళ్ళముందే ఇదంతా జరుగుతున్నాదన్న భావన కలిగించింది.ఒక రియల్ గ్యాంగ్ స్టర్ జీవితాన్ని దగ్గరనుంచి చూసి ఈ సినిమా ప్లాన్ చేశానని చెబుతారు వర్మ. రియల్ ఇన్సిడెంట్స్తో కొత్త నటీనటులతోనే షూట్ చేశారు. ఈ సినిమాలో జెడి చక్రవర్తి లీడ్ గా నటించారు. ఊర్మిలా మాటోండ్కర్ హీరోయిన్. మనోజ్ బాజ్పేయితో పాటు అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్లాతో సహా చాలా మంది ఈ సినిమాతో తెరకు పరిచయం అయ్యారు. అయితే సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయింది. మళ్ళీ రెండు వారాల అనంతరం రామ్ గోపాల్ వర్మ చర్చలతో సినిమాను మొదలు పెట్టారు. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరన్న కారణంగా వర్మ తనదైన శైలిలో విశాల్ భరద్వాజ్ తో పాటలను కంపోజ్ చేయించాడు. అది కూడా సినిమా కధలో ఇమిడి పోయేలా. 2కోట్ల బడ్జెట్ తో అతికష్టం మీద షూటింగ్ పూర్తి చేసిన రామ్ గోపాల్ వర్మ జూలై 3న సినిమాను విడుదల అయ్యింది. మొదట్టి 2 రోజులు మాములుగా ఉన్నా సినిమా ఫస్ట్ వీకెండ్ అనంతరం హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 18కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు టాక్. 1998లో అత్యదిక వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా సత్య న్యూ రికార్డును క్రియేట్ చేసింది.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







