అబు ధాబిలో రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి
- May 14, 2016
అల్ ఐన్ జాతీయ రహదారి మీద అల్ ఖజ్న ప్రాంతంలో రోడ్డు దాటే సమయంలో ఇద్దరు వ్యక్తులు దర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రీతం సలమాబాద్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరణించిన భారతీయ వ్యక్తి శిబు, ( 42 ) దుస్సంఘటన మరవక ముందే మరో ఇద్దరు రోడ్డు దాటుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రవాసీయులని కలవరపెడుతుంది. ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ రాజధాని ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్ జేయూది ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ వాహనదారులు గుర్తించలేని ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా ప్రజలు ఎట్టి పరిస్థితులలోను దాటకూడదని హెచ్చరించారు. పాదచారులు మరియు కర్ర ఊతంతో నడిచేవారు సంచరించే సమయంలో వాహనాల వేగాన్ని సైతం తగ్గింఛి మరియు రహదారిపై శ్రద్ద పెట్టాలని ఆయన డ్రైవర్లను కోరారు. అతను ట్రాఫిక్ చట్టాలు, వేగ పరిమితులు మరియు వాహనాలు మధ్య సురక్షితమైన దూరానికి గౌరవించడానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







