సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- July 04, 2023
న్యూ ఢిల్లీ: పుట్టపర్తి సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రధాని మోడి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ…పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు చెప్పారు. సత్యసాయి బాబా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్లు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలు పంచుకుంటారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశ యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ కేంద్రం ద్వారా దేశానికి ఎంతో మంది మేధావులను అందజేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు.
సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తి అని.. గుజరాత్ భూకంపం సమయం లో బాధితులకు అండగా సత్యసాయి బాబా నిలిచి సేవలు అందించారన్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ అందిస్తున్న సత్యసాయి ట్రస్టు కు అభినందనలు తెలిపారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు మానవాళికి ఎంతో అవసరం అన్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









