నకిలీ బంగారాన్ని విక్రయిస్తే.. 2ఏళ్ల జైలు, SR400,000 జరిమానా
- July 04, 2023
జెడ్డా : బంగారం విక్రయాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిన వారికి చట్టం ప్రకారం జరిమానా విధించబడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. విలువైన లోహాలు మరియు రత్నాల చట్టాన్ని ఎవరు ఉల్లంఘిస్తే వారికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష లేదా 400,000 SR లేదా రెండింటికి మించని జరిమానా విధించబడుతుందని వారు పేర్కొన్నారు.
మంత్రిత్వ శాఖకు చెందిన పర్యవేక్షక బృందాలు చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండేలా బంగారు విక్రయ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాయని పేర్కొంది. తనిఖీ బృందాలు విలువైన లోహాలు మరియు రాళ్ల నమూనాలను తీసుకుంటాయని, వాటిని సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ మరియు క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) ప్రయోగశాలలలో అవి నిర్దేశాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరిస్తారని తెలిపింది.
ఇదిలావుండగా.. హజ్ సీజన్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని బంగారం రంగంలో పెట్టుబడిదారు సలాహ్ అల్-అమ్మరీ తెలిపారు. యాత్రికులు తమ దేశాలకు తిరిగి వెళ్లేటప్పుడు బంగారాన్ని వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా సావనీర్గా కొనుగోలు చేయాలనే ఆసక్తి నేపథ్యంలో విక్రయాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా యాత్రికులు గొలుసులు, ఉంగరాలు, బ్రాస్లెట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని, 21 క్యారెట్ల బంగారానికి ఎక్కువ ఆదరణ ఉందన్నారు. ప్రస్తుత హజ్ సీజన్లో మక్కా, మదీనా మరియు జెద్దాలోని యాత్రికుల బంగారం అమ్మకాలు SR500,000, SR800,000 మధ్య చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు అల్-అమ్మరి తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









