మస్కట్లో ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన
- July 04, 2023
మస్కట్: ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన అయిన లోగోస్ హోప్ జూలై 13న బహ్రెయిన్లోని మనామా నుండి ఒమన్ సుల్తానేట్కు చేరుకుంటుంది. ఈ ఓడ జూలై 13-24 వరకు మస్కట్లో డాక్ అవుతుంది. అనంతరం సలాలాలో జూలై 27-ఆగస్టు 3 వరకు ఉంటుంది. జనవరి 2011, అక్టోబరు 2013లో కూడా ఈ లోగోస్ హోప్ నౌక ఒమన్ ను సందర్శించింది. సలాలాలో ఆగస్టు 3న ఒమన్ సందర్శన ముగిసిన తర్వాత, లోగోస్ హోప్ సీషెల్స్లోని విక్టోరియాకు బయలుదేరుతుంది. అక్కడ ఆగస్ట్ 10-17 వరకు ఉండి అనంతరం కెన్యాలోని మొంబాసాకు వెళుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన సాధారణంగా ప్రతి ఓడరేవులో దాదాపు రెండు వారాల పాటు ఉంటుంది . ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. సగటున, ప్రతి సంవత్సరం ఒక మిలియన్ సందర్శకులు ఓడలోని పుస్తక ప్రదర్శన శాలను సందర్శిస్తారు. ఈ నౌకలో పిల్లల శీర్షికలు, అకడమిక్ టెక్స్ట్లు, డిక్షనరీలు మరియు అట్లాస్లతో పాటు సైన్స్, స్పోర్ట్స్, కుకరీ, ఆర్ట్స్, మెడిసిన్, భాషలు, అనేక రంగాలు,సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా చదువొచ్చు. ఫ్లోటింగ్ బుక్ ఫెయిర్ లో 5,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఒరిజినల్ లోగోల కొనుగోలుతో 1970లో ప్రారంభించబడిన సముద్రయాన పుస్తక ప్రదర్శనను జర్మన్ లాభాపేక్షలేని గ్రూప్ గుడ్ బుక్స్ ఫర్ ఆల్ (GBA) నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఇది 150 కంటే ఎక్కువ దేశాలలో 480 వేర్వేరు ఓడరేవులను సందర్శించింది. 49 మిలియన్ల మంది ప్రజలు సందర్శించారు. ఇక ఒమన్ను సందర్శించనున్న సిబ్బందిలో 65 కంటే ఎక్కువ విభిన్న దేశాలకు చెందిన దాదాపు 350 మంది వాలంటీర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









