బహ్రెయిన్ లో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్, ఎగ్జిబిషన్
- July 04, 2023
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ రెండవ ఎడిషన్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు రోజుల ఈవెంట్ డిసెంబర్ 5 న ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఒక ప్రకటనను విడుదల చేశారు. జాతీయ భద్రత మరియు ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభంగా సైబర్ భద్రత ప్రాముఖ్యతను అందులో వివరించారు. "బహ్రెయిన్ భద్రత, శ్రేయస్సు సురక్షితమైన ICT మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది" అని లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. రాబోయే కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీకి అనుగుణంగా ఉన్నాయని, కొత్త టెక్నాలజీని అన్వేషించడం, గ్లోబల్ సైబర్స్పేస్ అభివృద్ధిని నేర్చుకోవడం, వ్యవహరించడం లక్ష్యంగా ఉన్నాయని షేక్ నాజర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









