మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న ఆఫీస్ బాయ్

- July 05, 2023 , by Maagulf
మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న ఆఫీస్ బాయ్

యూఏఈ: 45 ఏళ్ల నేపాల్ ప్రవాసుడు మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నాడు. ఈ డ్రాలో నెగ్గిన నాల్గవ నేపాల్ మిలియనీర్ గా ఘనత సాధించాడు. ఆఫీస్ బాయ్ గా పనిచేసే మెక్ఘ్  గత ఎనిమిదేళ్లుగా అబుధాబిలో నివసిస్తున్నాడు. శనివారం లైవ్ డ్రాకు ముందు మహ్జూజ్ వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అదే రోజు కోటీశ్వరుడయ్యాడు.2022లో Dh10 మిలియన్ గెలుచుకున్న డ్రాలో మొదటి నేపాల్ మిలియనీర్ అయిన భరత్ నిలిచాడు. 45 ఏళ్ల ఇద్దరు పిల్లల తండ్రి అయిన మెక్ఘ్.. వచ్చిన బహుమతి మొత్తాన్ని నతన పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి, ఇంటిని నిర్మించుకోవడానికి మరియు నేపాల్‌లో స్వదేశానికి తిరిగి చిన్న వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com