SIIMA అవార్డుల 11వ ఎడిషన్కు దుబాయ్ ఆతిథ్యం
- July 07, 2023
దుబాయ్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 11వ ఎడిషన్కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో SIIMA వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరుగనున్నాయి. జూలై 6న దుబాయ్లోని హబ్టూర్ ప్యాలెస్ హోటల్లో దక్షిణ భారత సూపర్ స్టార్లు రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్ సమక్షంలో SIIMA చైర్ పర్సన్ బృందా ప్రసాద్, అధికారిక హోస్ట్ పార్టనర్ ట్రక్కర్స్ డైరెక్టర్ విశాల్ మహాజన్ ఈ మేరకు ప్రకటించారు. ఈ SIIMA 11వ ఎడిషన్ లో రామ్ చరణ్, ధనుష్, యష్, పృథ్వీరాజ్ వంటి స్టార్స్ సందడి చేయనున్నారు. అలాగే రానా దగ్గుబాటి, రష్మిక, మృణాల్ ఠాకూర్, నయనతార, పూజా హెగ్డే దక్షిణ భారత సినిమా అతిపెద్ద రెడ్ కార్పెట్ షోలో మెరువనున్నారు. కీర్తి శెట్టి, హనీ రోజ్, నిధి అగర్వాల్, శాన్వి తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారని ట్రక్కర్స్ డైరెక్టర్ విశాల్ మహాజన్ తెలిపారు.
ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. సైమా తనకు చాలా ప్రత్యేకమైనదని, నాలుగు పెద్ద సినిమా పరిశ్రమలు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) తమ విజయాన్ని జరుపుకోవడానికి ఇది వేదికన్నారు. తనకు SIIMAతో 11 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో దక్షిణ భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి SIIMA వేదికను 2012లో ప్రారంభించారు. సెప్టెంబరు 14వ తేదీన మిడిల్ ఈస్ట్ రీజియన్ లోని దక్షిణ భారత వ్యాపార సంఘాన్ని ప్రొత్సహించేందుకు SIIMA బిజినెస్ అవార్డుల కార్యక్రమాలను నిర్వహిస్తుంది.


తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







