1.1 మిలియన్ దిర్హాంల విలువైన ఆభరణాలు చోరీ.. 12 గంటల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్
- July 08, 2023
యూఏఈ: 1.1 మిలియన్ దిర్హామ్ల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్ల నగదును అపహరించిన ముగ్గురు నిందితులను కేవలం 12 గంటల వ్యవధిలో అజ్మాన్ పోలీసులు పట్టుకున్నారు. అజ్మాన్ పోలీస్లోని ఆపరేషన్ గదికి బంగారు దుకాణం నుండి దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే ఒక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేసారు. ముగ్గురు నిందితులు పలుమార్లు బట్టలు మార్చుకుని, ముసుగులు ధరించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఏజీ, టీడీ, ఎస్ఏగా గుర్తించిన ముగ్గురు అరబ్ నిందితులను గుర్తించిన అధికారులు పట్టుకోగలిగారు. షార్జా పోలీసుల సహాయంతో మొదటి వ్యక్తిని పట్టుకున్నారు. రెండో నిందితుడు అజ్మాన్లోని రుమైలాలో టీడీ, అజ్మాన్లోని పారిశ్రామిక ప్రాంతంలో దోపిడీకి ప్లాన్ చేసి నడిపించిన మూడో నిందితుడు ఎస్ఏని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు తమ నేరాలను అంగీకరించారు. వారి నుండి 1.1 మిలియన్ దిర్హాంల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్ నగదును రికవరీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచి, అటువంటి నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తామని అజ్మాన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









