1.1 మిలియన్ దిర్హాంల విలువైన ఆభరణాలు చోరీ.. 12 గంటల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్

- July 08, 2023 , by Maagulf
1.1 మిలియన్ దిర్హాంల విలువైన ఆభరణాలు చోరీ.. 12 గంటల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్

యూఏఈ: 1.1 మిలియన్ దిర్హామ్‌ల విలువైన బంగారు ఆభరణాలు,  40,000 దిర్హామ్‌ల నగదును అపహరించిన ముగ్గురు నిందితులను కేవలం 12 గంటల వ్యవధిలో అజ్మాన్ పోలీసులు పట్టుకున్నారు. అజ్మాన్ పోలీస్‌లోని ఆపరేషన్ గదికి బంగారు దుకాణం నుండి దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే ఒక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేసారు. ముగ్గురు నిందితులు పలుమార్లు బట్టలు మార్చుకుని, ముసుగులు ధరించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఏజీ, టీడీ, ఎస్‌ఏగా గుర్తించిన ముగ్గురు అరబ్‌ నిందితులను గుర్తించిన అధికారులు పట్టుకోగలిగారు. షార్జా పోలీసుల సహాయంతో మొదటి వ్యక్తిని పట్టుకున్నారు. రెండో నిందితుడు అజ్మాన్‌లోని రుమైలాలో టీడీ, అజ్మాన్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో దోపిడీకి ప్లాన్ చేసి నడిపించిన మూడో నిందితుడు ఎస్ఏని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు తమ నేరాలను అంగీకరించారు. వారి నుండి 1.1 మిలియన్ దిర్హాంల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్ నగదును రికవరీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచి, అటువంటి నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తామని అజ్మాన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com