విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం..
- May 14, 2016వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈనెల 9న కుటుంబ సమేతంగా ఆయన థాయ్లాండ్ వెళ్లారు. ఏటా వేసవిలో కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల పాటు వ్యక్తిగత పర్యటనకి వెళ్లడం చంద్రబాబుకు ఆనవాయితీ. విదేశీ పర్యటన ముగించుకుని అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా 2గంటల సమయంలో విజయవాడలోని తన నివాసానికి వచ్చారు. ఇవాళ, రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానికి ఇవ్వాల్సిన నివేదికపై సీఎం పూర్తిస్థాయిలో కసరత్తు చేయనున్నారు. రేపు తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రధానికి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కసరత్తు చేయనున్నారు. ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు మహానాడు నిర్వహణ, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ