విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం..
- May 14, 2016
వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈనెల 9న కుటుంబ సమేతంగా ఆయన థాయ్లాండ్ వెళ్లారు. ఏటా వేసవిలో కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల పాటు వ్యక్తిగత పర్యటనకి వెళ్లడం చంద్రబాబుకు ఆనవాయితీ. విదేశీ పర్యటన ముగించుకుని అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా 2గంటల సమయంలో విజయవాడలోని తన నివాసానికి వచ్చారు. ఇవాళ, రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానికి ఇవ్వాల్సిన నివేదికపై సీఎం పూర్తిస్థాయిలో కసరత్తు చేయనున్నారు. రేపు తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రధానికి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కసరత్తు చేయనున్నారు. ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు మహానాడు నిర్వహణ, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







