విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న సీఎం..

- May 14, 2016 , by Maagulf
విదేశీ పర్యటన ముగించుకుని  హైదరాబాద్‌ చేరుకున్న సీఎం..

 వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈనెల 9న కుటుంబ సమేతంగా ఆయన థాయ్‌లాండ్‌ వెళ్లారు. ఏటా వేసవిలో కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల పాటు వ్యక్తిగత పర్యటనకి వెళ్లడం చంద్రబాబుకు ఆనవాయితీ. విదేశీ పర్యటన ముగించుకుని అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా 2గంటల సమయంలో విజయవాడలోని తన నివాసానికి వచ్చారు. ఇవాళ, రేపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానికి ఇవ్వాల్సిన నివేదికపై సీఎం పూర్తిస్థాయిలో కసరత్తు చేయనున్నారు. రేపు తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రధానికి ఇచ్చే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పై కసరత్తు చేయనున్నారు. ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు మహానాడు నిర్వహణ, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com