పూరీ-రామ్ పోతినేని.! ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ.!
- July 08, 2023
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇటు రామ్కీ అటు పూరీ జగన్నాధ్కీ మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ‘ఇస్మార్ట్ శంకర్’. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనుకున్నారు.
కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 9న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
జూలై 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. పూరీ కనెక్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం హీరోయిన్స్గా ఎవరిని తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శీనుతో ‘స్కంధ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రామ్, ‘డబుల్ ఇస్మార్ట్’పైనా ఫోకస్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









