పూరీ-రామ్ పోతినేని.! ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ.!

- July 08, 2023 , by Maagulf
పూరీ-రామ్ పోతినేని.! ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ.!

డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇటు రామ్‌కీ అటు పూరీ జగన్నాధ్‌కీ మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ‘ఇస్మార్ట్ శంకర్’. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనుకున్నారు.
కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 9న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్‌ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
జూలై 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం హీరోయిన్స్‌గా ఎవరిని తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 
ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శీనుతో ‘స్కంధ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రామ్, ‘డబుల్ ఇస్మార్ట్‌’పైనా ఫోకస్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com