పూరీ-రామ్ పోతినేని.! ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ.!
- July 08, 2023
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇటు రామ్కీ అటు పూరీ జగన్నాధ్కీ మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ‘ఇస్మార్ట్ శంకర్’. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనుకున్నారు.
కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 9న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
జూలై 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. పూరీ కనెక్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం హీరోయిన్స్గా ఎవరిని తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శీనుతో ‘స్కంధ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రామ్, ‘డబుల్ ఇస్మార్ట్’పైనా ఫోకస్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







