పూరీ-రామ్ పోతినేని.! ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ.!
- July 08, 2023డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇటు రామ్కీ అటు పూరీ జగన్నాధ్కీ మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ‘ఇస్మార్ట్ శంకర్’. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనుకున్నారు.
కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 9న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
జూలై 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. పూరీ కనెక్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం హీరోయిన్స్గా ఎవరిని తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శీనుతో ‘స్కంధ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రామ్, ‘డబుల్ ఇస్మార్ట్’పైనా ఫోకస్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన