కవిత పటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- July 10, 2023న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్ లో కోరారు.
అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు నేడు రద్దయ్యాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. కోర్టు నంబర్ 2, 8 లో రద్దయిన కేసుల విచారణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు