కవిత పటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- July 10, 2023
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్ లో కోరారు.
అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు నేడు రద్దయ్యాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. కోర్టు నంబర్ 2, 8 లో రద్దయిన కేసుల విచారణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









