ఒమన్ లో లంచం తీసుకున్న అధికారికి 5 ఏళ్ల జైలుశిక్ష

- July 11, 2023 , by Maagulf
ఒమన్ లో లంచం తీసుకున్న అధికారికి 5 ఏళ్ల జైలుశిక్ష

మస్కట్: లంచం, ఫోర్జరీ మరియు పదవీ దుర్వినియోగానికి సంబంధించి అనేక నేరాలు, దుర్వినియోగాలకు పాల్పడిన నలుగురు పౌరులకు ఐదు నుండి రెండేళ్ల వరకు శిక్ష పడింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగికి ఐదేళ్ల జైలు శిక్ష, OMR 48,000 జరిమానా విధించారు. దీంతోపాటు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించారు. అలాగే లంచం ఇచ్చినందుకు మరో వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, OMR 48,000 జరిమానా విధించారు.

క్రింది వారిని దోషులుగా నిర్ధారిస్తూ, క్రిమినల్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించి శిక్షలను ఖరారు చేసింది.

1- మూడు నేరాలతో సేలం బిన్ మసూద్ బిన్ సలేం (అధికారిక పత్రంలో ఫోర్జరీ చేయడం,  లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం, అధికార దుర్వినియోగం.

2- ఇషాక్ బిన్ అహ్మద్ బిన్ సయీద్ రెండు నేరాలు (అధికారిక పత్రంలో ఫోర్జరీ, లంచం స్వీకరించడం, పదవిని దుర్వినియోగం చేయడం).

3- అహ్మద్ బిన్ ఖల్ఫాన్ బిన్ ఖలాఫ్ రెండు నేరాలు (అధికారిక పత్రంలో ఫోర్జరీ, లంచం స్వీకరించడం). దీంతోపాటు సమాచార సాంకేతికత, సమాచార నెట్‌వర్క్‌ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ డేటాను దుర్వినియోగం చేశారు.

4- అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ సయీద్ రెండు నేరాలతో (నకిలీ అధికారిక పత్రాన్ని ఉపయోగించడం, మరో ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వడం), దుష్ప్రవర్తన  నేరాలను కోర్టు నిర్ధారించి శిక్షులు ఖరారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com