ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లకు టికెట్ల ధరలు వచ్చేశాయ్..
- July 11, 2023కోల్కతా: ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్కప్ – 2023 మెగా టోర్నీ భారత్ వేదికగా జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. భారత్లో మొత్తం పది మైదానాల్లో ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మైదానాల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఇక్కడ లీగ్, సెమీఫైనల్ -2 మ్యాచ్తో కలిపి ఐదు మ్యాచ్లు జరుగుతాయి. ఈ మైదానంలో జరిగే మ్యాచ్లను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ గ్రౌండ్లో టికెట్ల ధరలు ఎలా ఉంటాయనేదానిపై అయోమయం నెలకొంది. మంగళవారం ఈ విషయంపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) స్పష్టం ఇచ్చింది.
ప్రపంచ కప్ 2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్లకు ధరలు రూ. 650 నుంచి రూ. 3వేల వరకు ఉన్నాయి. భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్, సెమీస్కు ఒకే రకమైన ధరలను నిర్ణయించగా, మిగతా మూడు మ్యాచ్లకు వేరువేరు ధరలతో టికెట్లను క్యాబ్ విక్రయించనుంది. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో 63,500 మంది మ్యాచ్ను వీక్షించొచ్చు.
మ్యాచ్ల వారిగా టికెట్ ధరల వివరాలు..
బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్కు..
అప్పర్ టైర్స్ రూ. 650, డీ, హెచ్ బ్లాక్లకు రూ. వెయ్యి, బీ, సీ, కే, ఎల్ బ్లాక్లకు రూ. 1,500.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు..
అప్పర్ టైర్స్ రూ. 800, డీ,హెచ్ బ్లాక్ లు రూ. 1200, సీ,కె, బ్లాక్లు రూ. 2000, బి, ఎల్ బ్లాక్లు రూ. 2,200.
బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్కు..
అప్పర్ టైర్స్ రూ. 800, డీ,హెచ్ బ్లాక్లు రూ. 1200, సీ,కె బ్లాక్లు రూ. 2000, బీ,ఎల్ బ్లాక్లు రూ.2200.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్కు ..
అప్పర్ టైర్స్ రూ. 900, డీ,హెచ్ బ్లాక్లు రూ. 1500, సీ,కె బ్లాక్లు రూ. 2,500, బీ,ఎల్ బ్లాక్లు రూ. 3వేలు .
సెమీ-ఫైనల్ మ్యాచ్ల టికెట్ ధరలు..
అప్పర్ టైర్స్ రూ. 900, డీ, హెచ్ బ్లాక్లు రూ. 1500, సీ, కె బ్లాక్ లు రూ. 2,500, బీ,ఎల్ బ్లాక్ లు రూ. 3వేలు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్