పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- July 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్లోని ఓ పెర్ఫ్యూమ్ ప్లాంట్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు ఎమిరేట్స్కు చెందిన సివిల్ డిఫెన్స్ బలగాలు మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. రస్ అల్ ఖైమా, అజ్మాన్ మరియు షార్జాలోని పౌర రక్షణ విభాగాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఉమ్ అల్ క్వైన్ సివిల్ డిఫెన్స్ బృందంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉమ్ అల్ ఖువైన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ రషీద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా, అజ్మాన్ మరియు షార్జాలోని పౌర రక్షణ శాఖల వేగవంతమైన ప్రతిస్పందనను ప్రశంసించారు. మానవ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చారని కొనయాడారు. ఉమ్ అల్ ఖైవైన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా, డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ సలేం హమద్ బిన్ హమ్దాతో కలిసి ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. ఉమ్ అల్ ఖైవైన్లోని సివిల్ డిఫెన్స్ మరియు అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ ఖలీద్ అల్ షమ్సీ కూడా వారితో ఉన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









