ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్లు
- July 11, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్ల సమస్య ఇటీవల బాగా పెరిగింది. దీంతో కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పంపిన లింక్ ద్వారా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని ప్రజలను కోరుతూ స్కామర్లు పంపిన SMS సందేశాలు పంపుతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు చెల్లించకుంటే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని బెదిరించే సందేశాలు తాము పంపమని గమనించాలని కోరింది. ఇవి ప్రజలను మోసం చేయడానికి మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను క్లోనింగ్ చేసే వెబ్సైట్ను ఉపయోగించే స్కామింగ్ కార్యకలాపాలు, మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫారమ్, సహెల్ అప్లికేషన్లో ఉల్లంఘించిన వారికి మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనల హెచ్చరిక సందేశాలను పంపుతుందని పేర్కొంది. ఏదైనా చెల్లింపు ఆపరేషన్కు ముందు వారు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







