తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన
- May 14, 2016
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో అనూహ్యంగా విద్యార్థుల నమోదు ఎందుకు తగ్గిపోయిందని.. దీనిపై తమకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇంతటి తీవ్రమైన సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్వరంగా స్పందించి వెంటనే ఉపశమన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల చేరిక పెరిగే చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశించింది.ఇప్పటికే నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందని.. దాని ద్వారా మాత్రమే విద్యార్థుల నమోదు పెరగదని చెప్పింది. పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి పరిశీలనలు జరిపి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని.. వారిని ఆకర్షించే విధానాలు ప్రారంభించాలని సూచించింది.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







