భోజనం చేసిన వెంటనే నడక ఆరోగ్యమేనా.?
- July 12, 2023చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేసే అలవాటుంటుంది. అవును నిజమే.. భోజనం చేసిన తర్వాత అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి పడుకుంటే తేలిగ్గా వుంటుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
అయితే, భోజనం చేసిన వెంటనే వాకింగ్ అనేది అందరికీ మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 15 నుంచి 20 నిముషాల తర్వాతే వాకింగ్ చేయడం మంచిదట.
అలా చేయడం వల్ల పొట్టలో అసౌకర్యం అనిపించకుండా వుంటుంది. అప్పటికీ అసౌకర్యం అనిపిస్తే, అరగంట తర్వాత వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
వయసు పైబడిన వారూ, గర్బిణీ స్ర్తీలలో తిన్న వెంటనే శరీరం చాలా బరువుగా, ఆయాసంగా వున్నట్లు తోస్తుంది. గర్భిణీ స్ర్తీలు భోజనం తర్వాత నెమ్మదిగా వాకింగ్ చేయడం మంచిదే అని చెబుతున్నారు.
ఆ మాటకొస్తే, భోజనం చేసిన వెంటనే శరీరం రెస్ట్ కోరుకుంటుంది. అలా రెస్ట్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. భోజనం తర్వాత కాస్త అటూ ఇటూ శరీరానికి కదలిక ఇస్తేనే మంచిది.
అది కేవలం తేలికపాటి వాకింగ్ రూపంలోనే సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత వేగంగా నడిచే నడక మాత్రం ప్రమాదకరమే సుమా.!
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన