ప్రధాని మోదీతో సమావేశమైన ముస్లిం వరల్డ్ లీగ్ చీఫ్ అల్-ఇస్సా

- July 12, 2023 , by Maagulf
ప్రధాని మోదీతో సమావేశమైన ముస్లిం వరల్డ్ లీగ్ చీఫ్ అల్-ఇస్సా

న్యూ ఢిల్లీ: ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇస్సా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ భారతీయ వైవిధ్యం సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ మేరకు ట్విటర్‌లో ముస్లిం వరల్డ్ లీగ్ ఆర్గనైజేషన్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం వరల్డ్ లీగ్ (MWL) ప్రస్తుత సెక్రటరీ జనరల్ అయిన అల్-ఇస్సా.. ఐదు రోజుల పర్యటనలో భాగంగా జూలై 10 నుంచి ఇండియాలో పర్యటిస్తున్నారు. దేశ రాజధానిలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో ఖుస్రో ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. భిన్నత్వంతో కూడిన భారతదేశం "సహజీవనానికి గొప్ప నమూనా" అని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపగలదని ఆకాంక్షించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com