మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్త. రియాద్ ఎయిర్ హెచ్చరిక
- July 12, 2023
రియాద్: ఎయిర్లైన్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు మోసగాళ్ల గురించి జాగ్రత్తగా ఉండాలని రియాద్ ఎయిర్ హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కనిపించే మోసపూరిత ప్రకటనలు, లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సర్క్యులేట్ అవుతున్న మోసపూరిత ప్రకటనలలో ఉద్యోగావకాశాల కోసం దరఖాస్తుదారుని నుండి దరఖాస్తు ఫీజుగా డబ్బును అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తుదారులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఏదైనా ప్రీ-ఫీజులు లేదా ప్రైవేట్ బ్యాంక్ ఖాతా వివరాలను అభ్యర్థించరని రియాద్ ఎయిర్ స్పష్టం చేసింది. ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ తమ అధికారిక ప్లాట్ఫారమ్లలో మాత్రమే తమ సమాచారాన్ని సమర్పించాలని ఎయిర్లైన్ పిలుపునిచ్చింది.
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పిఐఎఫ్) పూర్తి యాజమాన్యంలోని సంస్థ రియాద్ ఎయిర్ స్థాపనను 2023 ఏప్రిల్లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. కొత్త జాతీయ క్యారియర్ సౌదీ నుండి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల దేశాల మధ్య సర్వీసులను ప్రారంభించనుంది. రియాద్ ప్రపంచానికి గేట్వేగా.. రవాణా, వాణిజ్యం మరియు పర్యాటకానికి ప్రపంచ గమ్యస్థానంగా మారడానికి ఇది వీలు కల్పిస్తుందని సౌదీ రూలర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









