ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి..
- July 13, 2023
బ్యాంకాక్: బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. విశాఖకు చెందిన 23 ఏళ్ల జ్యోతికి అంతర్జాతీయ పోటీల్లో ఇదే తొలి స్వర్ణం. గురువారం జరిగిన ఫైనల్స్లో జపాన్ అథెట్లు టెరాడా సుకా(13.13 సెకన్లు), అయోకి మసుమి(13.26 సెకన్ల) కంటే అత్యుత్తమ ప్రదర్శన చేసి 13.09 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ పోటీల చరిత్రలోనే 100 మీటర్ల హార్డిల్స్లో జ్యోతి దేశానికి తొలి స్వర్ణం అందించింది. జ్యోతి జాతీయ రికార్డు 12.82 సెకన్లుగా ఉంది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండో రోజు భారత్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. మహిళా 100 మీటర్ల హర్డిల్స్ రేసులో జ్యోతి యర్రాజీ, పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత అబ్దుల్లా అబూబకర్ లు స్వర్ణ పతకాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!







