ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి..
- July 13, 2023
బ్యాంకాక్: బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. విశాఖకు చెందిన 23 ఏళ్ల జ్యోతికి అంతర్జాతీయ పోటీల్లో ఇదే తొలి స్వర్ణం. గురువారం జరిగిన ఫైనల్స్లో జపాన్ అథెట్లు టెరాడా సుకా(13.13 సెకన్లు), అయోకి మసుమి(13.26 సెకన్ల) కంటే అత్యుత్తమ ప్రదర్శన చేసి 13.09 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ పోటీల చరిత్రలోనే 100 మీటర్ల హార్డిల్స్లో జ్యోతి దేశానికి తొలి స్వర్ణం అందించింది. జ్యోతి జాతీయ రికార్డు 12.82 సెకన్లుగా ఉంది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండో రోజు భారత్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. మహిళా 100 మీటర్ల హర్డిల్స్ రేసులో జ్యోతి యర్రాజీ, పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత అబ్దుల్లా అబూబకర్ లు స్వర్ణ పతకాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!







