ఇండియా-దుబాయ్ ఫ్లైట్ 13 గంటలు ఆలస్యం

- July 13, 2023 , by Maagulf
ఇండియా-దుబాయ్ ఫ్లైట్ 13 గంటలు ఆలస్యం

దుబాయ్: సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ రావాల్సిన విమానం 13 గంటలు ఆలస్యం కావడంతో 165 మంది ప్రయాణికులు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. "జులై 10న మంగళూరు-దుబాయ్ ఫ్లైట్ IX 813 ఆలస్యం కావడం వల్ల మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, తిరువనంతపురం నుండి ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది" అని ఎయిర్‌లైన్ తెలిపింది. జూలై 10వ తేదీ రాత్రి 11.05 గంటలకు బయలుదేరాల్సిన విమానం తిరువనంతపురం నుంచి పంపిన ఫెర్రీ విమానంలో జూలై 11న మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com