భద్రతా చర్యలపై కువైట్ ఫైర్ ఫోర్స్ సమీక్ష
- July 14, 2023
కువైట్: జ్లీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం తర్వాత కువైట్ ఫైర్ ఫోర్స్ తన ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, ఉల్లంఘనలపై సమీక్షించింది. KFF చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ రక్కన్ అల్-మెక్రాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్లీబ్ అల్-షుయౌఖ్ వంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత పక్షాలన్నీ కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









