Go First ఆపరేషన్స్ పునఃప్రారంభానికి అనుమతి

- July 22, 2023 , by Maagulf
Go First ఆపరేషన్స్ పునఃప్రారంభానికి అనుమతి

న్యూఢిల్లీ: పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA షరతులతో గ్రౌండెడ్ ఎయిర్‌లైన్ గో ఫస్ట్‌ను తన కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి అనుమతించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ మేరకు తెలిపింది. విమాన షెడ్యూల్‌ను రెగ్యులేటర్ ఆమోదించిన తర్వాతే టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది.

మే 2న, గో ఫస్ట్ తన విమానాలను రద్దు చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది. మే 10న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) మారటోరియం విధించింది. మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (IRP)ని నియమించింది. ఆ తర్వాత జూన్ 9న, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (CoC) గో ఫస్ట్ కోసం రిజల్యూషన్ ప్రొఫెషనల్ (RP)గా శైలేంద్ర అజ్మీరాను నియమించింది. దీనిని NCLT తరువాత ఆమోదించింది. RP పునరుద్ధరణ ప్రణాళికను 28.06.2023న DGCAకి సమర్పించారు.

2023 జూలై 4 నుండి 6వ తేదీ వరకు ముంబై, ఢిల్లీలో గో ఫస్ట్ సౌకర్యాల ప్రత్యేక ఆడిట్ జరిగింది. దీంతో రెగ్యులేటర్ 15 విమానాలు/ 114 రోజువారీ విమానాలను నడపడానికి అనుమతించింది. ఎయిర్‌లైన్‌లో దాదాపు 4,200 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయాన్ని రూ. 4,183 కోట్లుగా నివేదించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com