12 ఏళ్లలో ‘విజిటర్’ శరణార్థుల కోసం 18.57 బిలియన్ డాలర్లు ఖర్చు:సౌదీ

- July 25, 2023 , by Maagulf
12 ఏళ్లలో ‘విజిటర్’ శరణార్థుల కోసం 18.57 బిలియన్ డాలర్లు ఖర్చు:సౌదీ

జెడ్డా: 12 ఏళ్లలో ‘విజిటర్’ శరణార్థుల కోసం 18.57 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్టు కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్‌ఆర్‌రిలీఫ్) వెల్లడించింది. అత్యధిక సంఖ్యలో శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చే కొన్ని దేశాలలో సౌదీ అరేబియా ఒకటి అని తెలిపింది. గత 12 సంవత్సరాల కాలంలో రాజ్యం మొత్తం $18 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేసిందన్నారు. ఈ శరణార్థులు యెమెన్,  సిరియాతో పాటు మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. KSRrelief నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా వారికి ఉచిత చికిత్స, విద్యను అందిస్తుంది. రాజ్యంలో అన్ని ప్రాంతాలలో వారికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు, విద్యా అవకాశాలను అందించడం ద్వారా సౌదీ సమాజంలో వారి ఏకీకరణపై ఆసక్తిని కలిగి ఉంది. కింగ్‌డమ్‌లోని సందర్శకుల శరణార్థుల శాతం మొత్తం సౌదీ జనాభాలో 5.5 శాతానికి చేరుకుందని KSRelief ప్రకటించింది. 2011 నుండి ప్రస్తుత సంవత్సరం 2023 వరకు వారికి అందించిన మొత్తం సహాయం $18,577,514,133 అని వెల్లడించింది. ఇందులో యెమెన్ $10,444,468,449; సిరియన్లు $5,879,144,198;  రోహింగ్యా $2,253,901,486 లకు ఖర్ఛు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) అందించే సేవలు $7,439,737,181; విద్య $5614,147,528; మరియు ఆరోగ్యం $5,523,629,424 కేటాయించారు.  2022లో సౌదీ అరేబియా ఇటీవలి సంవత్సరాలలో 1.07 మిలియన్ల మంది శరణార్థ సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చిందని, ఇది సౌదీ జనాభాలో 5.5 శాతానికి సమానమని నివేదించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com